పార్టీలకు అతీతంగా అభివృద్ధి పథంలో మహబూబ్ నగర్

ప్రతి రూపాయి పారదర్శక వినియోగమే లక్ష్యం - ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పార్టీలకు అతీతంగా అభివృద్ధి పథంలో మహబూబ్ నగర్

2026–27 తొలి కార్పొరేషన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్

మహబూబ్ నగర్ మార్చ్ 28 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)

మహబూబ్ నగర్ నగర అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్‌ను నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, మహబూబ్ నగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేషన్‌గా మారిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ కావడంతో దీన్ని సమర్థవంతంగా అమలు చేసి నగరానికి అద్భుతంగా అభివృద్ధి చేద్దాం అన్నారు. గతంలో బడ్జెట్‌లో ఉన్న లోటును దశలవారీగా భర్తీ చేయడానికి కృషి చేయాలని, ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నగర అభివృద్ధి ఒక్కరి వల్ల సాధ్యం కాదని, అందరి భాగస్వామ్యంతోనే సాధ్యం అని ఆయన పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఆదాయ వనరులను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, పన్నుల వసూళ్లను పెంపొందించాలని సూచించారు. ముఖ్యంగా ఆస్తి పన్నుల వసూళ్లు 100 శాతం జరిగితేనే ప్రతి డివిజన్‌లో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.

                ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయి ఖర్చు పారదర్శకంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో ఎటువంటి దుర్వినియోగం జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని, నిధులను సమర్థవంతంగా వినియోగిస్తేనే మహబూబ్ నగర్‌ను రాష్ట్రంలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దవచ్చని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఐదు సంవత్సరాల పాటు మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు సేవ చేసే అవకాశం మీకు లభించిందని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారి మన్ననలు పొందాలని ఆయన సూచించారు. అనంతరం ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారిని కార్పొరేటర్లు ఘనంగా సన్మానించారు. సభలో అభినందనలు తెలియజేసి, ఆయన నాయకత్వంలో నగరం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఏప్రిల్ 11న  మహాత్మా జ్యోతిబా పూలే  జయంతోత్సవం కు ఏప్రిల్ 11న  మహాత్మా జ్యోతిబా పూలే  జయంతోత్సవం కు
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక దృష్టి 
ప్రజల భద్రత కొరకే పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్...
హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి వైద్యుల రికార్డు  - 346 కిడ్నీ మార్పిడి చికిత్సలతో రికార్డు సృష్టించిన ఆసుపత్రి వైద్యులు 
సమ్మె చేస్తున్న ఆర్టిసన్స్ ను చర్చలకు పిలవాలి.
ఉన్నత విద్య నేటి తరాలకు అందించవలసిన అవసరం అధ్యాపకులపై ఉన్నది.
పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదు – ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్