ఖమ్మం, :లోకల్ గైడ్ :
భూదాన్ భూముల వ్యవహారంలో పతి పక్షాలు అభాసుపాలైన ఇంకా మభ్య పెట్టేందుకు ప్రయత్నాలు చేయడం తగదని , అధ్యక్షులు డిసిసి ఖమ్మం కార్పొరేషన్ , మాజీ కార్పొరేటర్ నాగండ్ల దీపక్ చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత రెండు మూడు రోజులుగా నడుస్తున్న భూదాన్ భూ వ్యవహారం లో నిండా మునిగిన ప్రతి పక్ష పార్టీలు సైతం రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. కొండను తవ్వి ఎలుకను బట్టిన విపక్షాలు, పేదల పొట్ట కొడుతున్న ప్రభుత్వం అని గగ్గోలు పెట్టిన ముఠా పార్టీలకు అసలు పేదల ఇండ్ల కంటే బడా బాబుల ఇండ్లే ఎక్కువ ఉండటం నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు ఉంది అని తెలిపారు. ముఠా మెస్ట్రీలు ఏర్పాటు చేసుకున్న ఏజెంట్స్ తమ నుండి వసూలు చేసిన లక్షల రూపాయల డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా వారిని పట్టుకుని కట్టేసి నిలదీస్తున్న ప్రజల పక్షాన తాము నిలిచి వారికి న్యాయం చేస్తామని తెలిపారు. తమ గుట్టు ఎక్కడ బయట పడుతుందోనని ఆందోళనలో ముఠా మెస్ట్రీలు ఉన్నారని తెలిపారు. 2019 నుండి 2023 వరకు వెలుగుమట్ల భూముల పట్ల అనాటి ప్రభుత్వం పన్నిన కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం తో తమ తప్పులను మంత్రి తుమ్మల వైపు వేయాలని చూస్తున్న వైనం ను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. చైతన్యవంతులైన ఖమ్మం జిల్లా ప్రజలు ప్రతి పక్షాలకు ఇటివల జరిగిన ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పారని అన్నారు. ఈ రెండు సంవత్సరాల కాలం లోనే వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరగడం, ఖమ్మం లో ఖిల్లా టూ నరసింహ స్వామి గుట్ట కు రోప్ వే, తీగల బ్రిడ్జి, టీటీడీ దేవస్థానం, స్టేడియం, కళ్యాణ మండపం ఇలాంటి నిర్మాణాలతో పర్యాటక కేంద్రంగా తయారు చేయడం , స్వామి నారాయణ స్కూల్,ఇంటిగ్రేటెడ్ స్కూల్, మెడికల్ కాలేజీ, వంటి విద్యాలయాలు స్థాపన, ఆధునిక వ్యవసాయ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ ఇలాంటి వాణిజ్య సదుపాయాలతో ఖమ్మం ను రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా నిలుపుతున్న మంత్రి తుమ్మల పై ప్రతిపక్షాల అక్కసు వెళ్లగక్కటం తగదు అని తెలిపారు.
మచ్చలేని మహానేత పై మరకలు పులమఠానికి ప్రయ