సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాన్ని ప్రారంభించిన
మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ నగరంలోని ఆర్టీసీ కాలనీ బస్టాండ్ వెనకాల నూతనంగా ఏర్పాటు చేసిన సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనాన్ని, గురువారం రాష్ట్ర రోడ్డు భవనాల సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. సందర్భంగా అతిథులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తమ వైద్య సేవలు అందిస్తూ నేడు నూతన భవన్లోకి ప్రవేశిస్తున్న హాస్పిటల్ డాక్టర్లకు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.తక్కువ ఖర్చులోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, హాస్పిటల్ చైర్మన్ రాపోలు దత్త గణేష్, డైరెక్టర్ హాస్పిటల్ రాపోలు అవంతు, డాక్టర్లు రాపోలు అనిల్ కుమార్,దేవి, నగర ప్రముఖులు వివిధ పార్టీల నాయకులు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
