ప్రజా పాలనలో సొంతింటి కల సహకారం

ఇందిరమ్మ ఇండ్ల పథకం గ్రామీణ ప్రాంతాల్లో మంచి స్పందన పొందుతోంది.

ప్రజా పాలనలో సొంతింటి కల సహకారం

లోకల్ గైడ్/బంట్వారం:

ప్రజా పాలనలో భాగంగా పేదల సొంతింటి కలలను నిజం చేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం గ్రామీణ ప్రాంతాల్లో మంచి స్పందన పొందుతోంది. ఈ క్రమంలో బంట్వారం గ్రామానికి చెందిన మైసగళ్ల అపర్ణకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఇంటి నిర్మాణానికి శుభారంభంగా ముగ్గు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కె. గోపాల్, ఫీల్డ్ అసిస్టెంట్ ఎం. రమేష్, ఇంద్రమ్మ కమిటీ సభ్యుడు దొరేటి సుధాకర్, వార్డు సభ్యుడు రాజ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు అల్లంపల్లి శ్రీనివాస్, సిద్ధిరాములు, ప్రభాకర్, నర్సింలు పాల్గొన్నారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో ముగ్గు వేయడంతో అపర్ణ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ..ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాల వల్ల పేద కుటుంబాలు సురక్షిత నివాసాన్ని పొందుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల మంజూరు జరిగేలా చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News