పేకాట స్థావరంపై  పోలీసుల దాడి 7గురి పై కేసు: రూరల్ ఎస్సై

సతీష్ రెడ్డి

పేకాట స్థావరంపై  పోలీసుల దాడి 7గురి పై కేసు: రూరల్ ఎస్సై

 
నారాయణపేట ఏప్రిల్ 9:
నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మన్‌పాడు గ్రామంలో  గురువారం  పేకాట ఆడు తున్న వారిపై రూరల్ ఎస్సై సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ దాడిలో ఏడుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి రూ. 4,330 నగదు, 04 సెల్ ఫోన్లు, 02 ద్విచక్ర వాహ నాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించామని తెలిపారు.
ఈ ఘటనపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు  తెలిపారు.
ఫోటో రైట్ అప్:8.పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు 
____________________

Tags:

About The Author

Latest News