ఘనంగా సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు

పాల్గొన్న..బేరి రామచందర్ యాదవ్, ఖాసీం

ఘనంగా సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు

 

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి):

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ నేతాజీనగర్‌లో నేతాజీసుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. “సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య సమరయోధుల లో అగ్రగణ్యులు. ఆయన త్యాగం, పోరాటం వలనే ఆజాద్ హింద్ సైన్యం రూపుదిద్దుకుంది. బ్రతికి ఉండి ఉంటే ఆయనే దేశ ప్రధాని అయ్యేవారు” అన్నారు. ఈ కార్యక్రమంలో గుల్మోహర్ పార్క్ కాలనీ అధక్షులు ఖాసిం, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, నేతాజీ నగర్ కాలనీ ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్, కాలనీ పెద్దలు, మహిళలు, యువత, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వినాయక మండపాలలో జాగ్రత్తలు పాటించాలి వినాయక మండపాలలో జాగ్రత్తలు పాటించాలి
వినాయక విగ్రహాలుఏర్పాటుకు అనుమతి తప్పనిసరి విగ్రహాల ఏర్పాటు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి . మోమిన్ పెట్ సర్కిల్ఇ న్స్పెక్టర్ బి.వెంకట్ 
ఆశా వర్కర్ల  పారితోషకాలను వెంటనే చెల్లించాలి...
గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా జిల్లాలో గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి.
షాద్ నగర్ పట్టణ అభివృద్ధి తన ధ్యేయం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 
రైతులకు యూరియా సరఫరా పగడ్బందీగా నిర్వహించాలి*
అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు
ఘనంగా సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు