మండలాలను మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం 

బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు వేపూరి

మండలాలను మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం 

నారాయణపేట మార్చి 5:

నారాయణపేట నియోజక వర్గంలో కొత్తగా మూడు మండలాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం ఏర్పడ్డాక  మరిచి పోయారని నారాయణపేట మండల బి ఆర్ ఎస్ అద్యక్షుడు వేపూరి రాములు ఒక ప్రకటనలో విమర్శించారు.ఎన్నికల ప్రచారంలో సి ఎం.రేవంత్ రెడ్డి,నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి నియోజక వర్గంలో కొత్తగా కోటకొండ,కోయిల్ కొండ,కానుకుర్తి మూడు మండలాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి  గెలుపొందారని అన్నారు.మూడు మండలాలు ఏర్పాటు అయితే ప్రజలకు పాలనా సౌలభ్యం అవుతుందని కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించారని అన్నారు.కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల పూర్తి అయినా నేటి వరకు ఏర్పాటు చేయకుండా ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసిందని అన్నారు.ఇప్పటికైనా ఇచ్చిన హామీ మేరకు నారాయణపేట నియోజకవర్గంలో కోటకొండ, కోయిల్ కొండ,కానుకుర్తి మండలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.లేకపోతే రానున్న రోజుల్లో ఈ ప్రజలే కాంగ్రెస్ కు బుద్ది చెబుతారని హెచ్చరించారు.
ఫోటో రైట్ అప్:2.వేపూరి రాములు 
_______________________

Tags:

About The Author

Latest News

హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 
సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం
గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు – సేవల నాణ్యతపై కఠిన సమీక్ష
విజయలక్ష్మి హాస్పిటల్ తనిఖీ. షోకాస్ నోటీసులు జారీ.