ఉత్సాహంగా పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు

ఉత్సాహంగా పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు

ఖమ్మం:లోకల్ గైడ్ :
ప్రతి విద్యార్థి ఉత్తమ విధ్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అడిషనల్ డిసిపి ఏఆర్  కుమారస్వామి   అన్నారు.*శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాల స్కూల్ చైర్ పర్సన్ శ్రీమతి నిషిత శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన  10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశాన్ని ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించారు.* ఈ సందర్భంగా
స్కూల్ అడిషనల్ డిసిపి ఏఆర్  మాట్లాడుతూ..విద్యార్థులు 10వ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు నిర్దేశిత ప్రణాళికలను అనుసరించాలని అన్నారు.
 పది ఫలితాలు విద్యార్థి భవితను దిశానిర్దేశం చేస్తాయనీ, విద్యార్థి సమగ్ర అభివృద్ధికి సూచికగా నిలుస్తాయని అన్నారు. *లక్ష్యం సాధించడానికి ఏకాగ్రత అవసరమనీ, ఇష్టపడి చదివి పాఠశాలకు,ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు.*
SSC విద్యార్థులకు ఇటీవల  నిర్వహించిన  క్రీడల్లో విజేతలకు  బహుమతి  అందజేశారు, *పదో తరగతి పరీక్షకు వెళ్లే  విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్, జామెంట్రీ బాక్స్ అందజేశారు.* అనంతరం విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. *పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులు సాంప్రదాయ దుస్తులు ధరించి సంస్కృతిక నృత్యాలను, జానపద కళా రూపాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.*
అడిషనల్ డీసీపీ ఏఆర్ పిల్లలకు స్వయంగా భోజనాలు వడ్డించారు.
*ఈ కార్యక్రమంలో* ఏఆర్ ఏసీపీ  నరసయ్య, ఆర్ ఐ  కామరాజు, స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రాజు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 
సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం
గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు – సేవల నాణ్యతపై కఠిన సమీక్ష
విజయలక్ష్మి హాస్పిటల్ తనిఖీ. షోకాస్ నోటీసులు జారీ.