రాజ్యసభ స్థానాలలో బీసీలకు రెండు సీట్లు కేటాయించాలి.

రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్

రాజ్యసభ స్థానాలలో బీసీలకు రెండు సీట్లు కేటాయించాలి.

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలలో బీసీలకు కనీసం రెండు సీట్లు కేటాయించాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా రెండు స్థానాలను ఓసీలకు కేటాయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో సుమారు 56 శాతం జనాభా ఉన్న బీసీలకు చట్టసభలలో కనీసం 15 శాతం సీట్లు కూడా దక్కడం లేదన్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలను బీసీ నాయకులకు కేటాయించి సామాజిక న్యాయం చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అధిష్ఠానం నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ ప్రకటించ బోయే రాజ్యసభ అభ్యర్థులలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సమర్థవంతమైన ఇద్దరు బీసీ నాయకులను ఎంపిక చేసి రాజ్యసభకు పంపితే కాంగ్రెస్ ప్రభుత్వం తన సామాజిక న్యాయ వైఖరిని ప్రజలకు స్పష్టంగా తెలియజేసినట్ల వుతుందని అన్నారు. బీసీలకు రాజ్యసభలో రెండు స్థానాలు కేటాయించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని భేరి రామచంద్ర యాదవ్ హెచ్చరించారు.

Tags:

About The Author

Latest News

హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 
సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం
గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు – సేవల నాణ్యతపై కఠిన సమీక్ష
విజయలక్ష్మి హాస్పిటల్ తనిఖీ. షోకాస్ నోటీసులు జారీ.