పెద్ద గుండ్ల తండలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ రాజు నాయక్  

పెద్ద గుండ్ల తండలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

మిడ్జిల్ జనవరి 26(లోకల్ గైడ్):

పెద్ద గుండ్ల తండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజు నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్బంగా సర్పంచ్ రాజు నాయక్ మాట్లాడుతూ  జనవరి 26న మనం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు ఉపసర్పంచ్ శ్రీనునాయక్ మాట్లాడుతూ…
భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ మన రాజ్యాంగ పితామహుడు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, దాని విలువలను కాపాడాలి అని అన్నారు.నేనుభారతీయుడిగాగర్వపడుతున్నాను. నా దేశాన్ని ఎంతోప్రేమిస్తున్నాను అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ శైలజ, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఏవిత,వార్డు మెంబర్ భాస్కర్, రాజశేఖర్, గోరి, రంగమ్మ, మూడవత్ హుని, మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, మధు గోరియా దేవ్ సింగ్ శంకర్ సక్రియ దేవ్ సింగ్ కుమార్ మెగావత్ శ్రీను అంగోత్ దేవుల నాయక్ మెగావత్ చందునాయక్, శ్రీకాంత్ నీలమ్మ శిరీష  లతోపాటు,గ్రామ ప్రజలు, యువకులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News