గేట్ కారేపల్లి లో సౌర్వభామ గణతంత్ర దినోత్సవం వేడుకలు 

77 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు పంచాయతీ ప్రజల సమక్షంలో లో ఘనంగా నిర్వహించినారు.

గేట్ కారేపల్లి లో సౌర్వభామ గణతంత్ర దినోత్సవం వేడుకలు 

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి: లోకల్ గైడ్ రిపోర్టర్, జనవరి 26: సింగరేణి మండలం గేట్ కారేపల్లి పంచాయతీ సర్పంచ్ పూసం ఎల్లయ్య, ఉపసర్పంచ్ కందుల శ్రీనివాసరావు, సెక్రటరీ కె. అనూష అధ్యక్షతన 77 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు పంచాయతీ ప్రజల సమక్షంలో లో ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్బంగా సర్పంచ్ ఎల్లయ్య మాట్లాడుతూ సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం హక్కులను డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ రచించిన రాజ్యాగం ద్వారా మనకు కలిగినయ్ అనీ ప్రతీ ఒక్కళ్లు రాజ్యాంగ అలవాట్లకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చాడు. తదనంతరం పంచాయతీ పాలక వర్గాన్ని, కార్యదర్శి నీ అంగన్వాడీ సిబ్బంది మర్యాద పూర్వకంగా సన్మానించుకున్నారు.  ఈ కార్యక్రమం లో పంచాయతీ పాలకవర్గం సభ్యులు, అంగన్వాడీ టీచర్స్ ఇల్లంగి విజయ, భూక్యా లక్ష్మి, సోమందుల నాగమణి, తోటి సిబ్బంది. ఏ ఎన్ ఎం మల్లీశ్వరి, ఆశవార్కర్ ఉమా, గ్రామ పెద్దలు చెరుకూరి వెంకటయ్య, సాయిన్ని తిరపయ్య, గుడిపూడి తిరుమల్ రావు,గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News