సుఖ్ దేవ్ నగర లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జాతీయ జెండా ఎగరవేసిన బిఆర్ఎస్ ఖైరతాబాద్ ఇంచార్జి మన్నే గోవర్ధన్ రెడ్డి
కుత్బుల్లాపూర్ జనవరి 26 (లోకల్ గైడ్ ప్రతినిధి)
మన మనస్సులో నిష్కల్మషం, మన మాటల్లో పదును, మన రక్తంలో స్వచ్ఛత, మన గుండెల్లో ధైర్యం, మన ఆత్మలలో భారతీయులమనే గర్వం, ఇవన్నీ రాజ్యాంగం ద్వారా మనకందించిన డాక్టర్ భీమ్రావు అంబేద్కర్కి వందనం దేశ ప్రజలందరికీ బిఆర్ఎస్ ఖైరతాబాద్ ఇంచార్జి మన్నే గోవర్ధన్ రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సుఖ్ దేవ్ నగర్ రోడ్ నెంబర్ 4 లో సలహాదారులు మరాఠీ రాజలింగం , నీలం నర్సింగ్ రావు మరియు స్థానిక పంచకమిటీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం నిర్వహించి జెండాను ఆవిష్కరించడం జరిగింది గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం చాలా గర్వకారణం. అనేక మంది గొప్ప వ్యక్తుల త్యాగాల ఫలితంగాఈశుభదినంరోజునకోట్లాదిమందిప్రజలఆశలునెరవేరాయి.ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని కలిగి ఉన్న దేశంగా భారతదేశం నిలిచింది, రాజ్యాంగాన్ని గౌరవించడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా మనం మన బస్తీ లో జరిగే ప్రతి కార్యక్రమం ఇదే విధంగా కుటుంబ సభ్యులు వలె కలిసి పనిచేసే ఒకటి గా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను .సుఖ్ దేవ్ నగర్ బస్తీ వాసులకు మరొకసారి 77 వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు, నాయకులు పంచ కమిటీ సభ్యులు తదితరుల పాల్గొన్నారు
