క్యాసారం మల్లన్న ఆలయ నిర్మాణానికి రూ.25 వేల ఆర్థిక సహాయం.

డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు రూ.25,000/-ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

క్యాసారం మల్లన్న ఆలయ నిర్మాణానికి రూ.25 వేల ఆర్థిక సహాయం.

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

పఠాన్ చేరు మండలం క్యాసారం గ్రామంలో నిర్మాణంలో ఉన్న మల్లన్న ఆలయానికి సంగారెడ్డి జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు రూ.25,000/-ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని క్యాసారం గ్రామ ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామ నాయకులు మహేష్ యాదవ్, అమీర్‌లకు అందించారు. ఈ సందర్భంగా పర్స శ్యామ్ రావు మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాలలో దేవాలయాలు ప్రజల ఐక్యతకు, సాంస్కృతిక విలువల పరిరక్షణకు కేంద్రబిందువులుగా ఉంటాయని అన్నారు. మల్లన్న ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొని ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిన పర్స శ్యామ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

About The Author

Latest News