ప్రశాంత, పచ్చని, ప్రగతిశీల నగరంగా ఖమ్మం... రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు.
రోడ్ల విస్తరణతోనే సుందర నగరం
నగరంలోని 36వ డివిజన్ లో రజక భవన్ నిర్మాణానికి శంఖుస్థాపన, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవం చేసిన మంత్రి తుమ్మల

ఖమ్మం:లోకల్ గైడ్:
ఈ సందర్భంగా *మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ*, నగరంలో అన్ని మౌళిక సదుపాయాల కల్పన చేస్తున్నట్టు తెలిపారు. పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్స్, సిబ్బందిని పెంచి, 12 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజారోగ్యం కోసం పట్టణ పీ.హెచ్.సీ. ల ఏర్పాటు చేశామన్నారు. పట్టణ పి.హెచ్.సి. లతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి లోడ్ తగ్గుతుందని అన్నారు. ఆరోగ్య కేంద్ర సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే మధ్య తరగతి, పేద వారికి ఉపయోగం కలుగుతుందని అన్నారు.
కోట్ల రూపాయలు ఉన్నా రహదారులు ఇరుకుగా ఉంటే ఏమి ఉపయోగం లేదని, జనాభాకు తగ్గట్టు రహదారుల విస్తరణ చేస్తే, వ్యాపారం బాగా ఉంటుందని, విలువ పెరుగుతుందని, నగరం అందంగా తయారవుతుందని తెలిపారు. రోడ్ల విస్తరణతోనే మీ ఆస్తులకు విలువ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని మంత్రి అన్నారు. కస్బా బజార్ విస్తరణతో బ్రాండెడ్ షో రూమ్ లు వచ్చాయని తెలిపారు. చుట్టుపక్కల జిల్లాల వారు ఖమ్మం లో నివసించేలా మౌళిక సదుపాయాల కల్పన చేయాలన్నారు. విస్తరణలో కోల్పోయిన వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామని అన్నారు. ఖమ్మం నగరంలో అన్ని కులాలు, వర్గాల వారు సామరస్య జీవనం ఉండేలా ఖమ్మం నగరాభివృద్ధి చేయాలని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. రామారావు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
