మున్సిపోల్  నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి - కలెక్టర్ పట్నాయక్ 

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.  

మున్సిపోల్  నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి  - కలెక్టర్ పట్నాయక్ 

నారాయణపేట   లోకల్ గైడ్

నారాయణపేట జిల్లాలోనీ నాలుగుమున్సిపాలిటీలు నారాయణపేట,మక్తల్, కోస్గి, మద్దూరులో వార్డు ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అన్ని  ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.  మంగళవారం హైదరాబాద్ నుంచి సీ.ఎస్. కే రామకృష్ణా రావు, డీజీపీ శివధర్ రెడ్డి తో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినీ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్ల లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ ల నిర్వహణ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ల కు సూచించారు. గత నెల డిసెంబర్ లో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లే, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఆమె తెలిపారు. అనంతరం ఎన్నికల కమిషనర్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్డ్ ను విడుదల చేశారు. 
కాగా నారాయణపేట కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వీసీ లో పాల్గొన్నారు.  వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల ఎన్నికలకు షెడ్యూల్డ్ విడుదల అయిందని, ఈ నెల 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుం దని, నామినేషన్ల ప్రక్రియ మొదలుకుని, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, తుది జాబితా, గుర్తుల కేటాయింపు, పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ నిర్వహణ కు ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియ వరకు ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయా మున్సిపల్ కమిషనర్ లను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ డీ సీ రాజేందర్ గౌడ్, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్డీవో రామచందర్ నాయక్, నోడల్ అధికారులు సాయిబాబా, జాన్ సుధాకర్, అబ్దుల్ ఖలీల్,  రహమాన్, మున్సిపల్ కమిషనర్లు గోల్కొండ నర్సయ్య, శ్రీ రాములు, నాగరాజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News