ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ సుందర్ ఆకస్మిక మరణం పట్ల సంతాపం.

తెలిపిన..ఎమ్మెల్సీ అంజిరెడ్డి, అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి

IMG-20260211-WA0171పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ సుందర్ ఆకస్మిక మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ డాక్టర్ సి. అంజిరెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సుందర్ తమ రాజకీయ ప్రస్థానంలో ఆప్తుడిగా, శ్రేయోభిలాషిగా నిలిచారని పేర్కొన్నారు. రామచంద్రపురం మండలంలో ఆంధ్రజ్యోతి జర్నలిస్టుగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మృదుస్వభావి, అందరినీ కలుపుకుని పోయే వ్యక్తిత్వం ఆయనదని, గత మూడు నాలుగు సంవత్సరాలు గా ఆరోగ్యం సహకరించక పోయినా జర్నలిజం వృత్తిపట్ల అపార నిబద్ధతతో సేవలు కొనసాగించిన నిజమైన పాత్రికేయుడని అభివర్ణించారు. సుందర్ మరణం జర్నలిస్టు వర్గానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ అపార దుఃఖాన్ని భరించే మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు.

Tags:

About The Author

Latest News