ఓటు వేసి వచ్చేలోపు ఇల్లు గుల్ల

2లక్షల నగదు 2 తులాల బంగారం దోపిడి

ఓటు వేసి వచ్చేలోపు ఇల్లు గుల్ల

నారాయణపేట ఫిబ్రవరి 11:

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో బుధవారం ఇంటి సభ్యులు ఓటు వేసి వచ్చేలోపు ఇంటి తాళం విరగ్గొట్టి పట్టపగలు దొంగలు 2లక్షల నగదు 2 తులాల బంగారం దోచుకుపోయారు.మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో 8వ వార్డులో శబరి కాలనీలో విజయాభాస్కర్ రెడ్డి దంపతులు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఇంటికి తాళం వేసి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లారు.విజయభాస్కర్ రెడ్డి స్థానిక బజాజ్ షో రూంలో సేల్స్ మెన్ గా పనిచేస్తూ రెండు రోజుల కలెక్షన్ 2 లక్షల నగదు బీరువాలలో ఉంచి వాటితో పాటు చెవి పోగులు,కమ్మలు,ఉంగరం నగలు బీరువాలో ఉంచి బీరువా కు,ఇంటికి తాళంవేసి ఓటు వేయడానికి వెళ్లారు.ఓటు వేసి రాగా ఇంటికి వేసిన తాళం కనిపించక పోవడంతో లోపల బీరువా తెరిచి 2 లక్షల నగదు 2తులాల బంగారం నగలు ఎత్తుకెళ్లి బట్టలు చిందర వందరగా పడేశారని ఆందోళన వ్యక్తం చేశారు.వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఫోటో రైట్ అప్:3.బీరువాను పరిశీలిస్తున్న పోలీసులు
_____________________

Tags:

About The Author

Latest News