బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా బి అరవింద్ స్వామి

జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య

బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా బి అరవింద్ స్వామి

 

వనపర్తి రూరల్ (లోకల్ గైడ్) మార్చి 22
బిసి రాష్ట్ర కార్యాలయం లోని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య,జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ ,రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు తెలంగాణ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు గా బి అరవింద్ స్వామి ని నియమించడం జరిగింది యువ శక్తికి ప్రతీకగా అరవింద్ స్వామి నియామకం బీసీ ఉద్యమానికి నూతన అధ్యాయం
బీసీ సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా  అరవింద్ స్వామి నియామకం రాష్ట్రవ్యాప్తంగా విశేష చర్చనీయాంశంగా మారింది. అతి చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి బాధ్యతలను చేపట్టడం ద్వారా ఆయన యువ నాయకత్వానికి ప్రతీకగా నిలిచారు. ఈ నియామకం బీసీ ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపుగా, భవిష్యత్ దిశను నిర్దేశించే నిర్ణయంగా విశ్లేషించబడుతోంది.
వనపర్తి జిల్లా నుంచి వచ్చిన అరవింద్ స్వామి  విద్యార్థి దశ నుంచే సామాజిక ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ, బీసీ వర్గాల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేశారు. విద్యార్థి ఉద్యమాల్లో ఆయన పోషించిన పాత్ర, సామాజిక సమస్యలపై లోతైన అవగాహన, ప్రజలతో ఏర్పరచుకున్న బలమైన అనుబంధం, ఆయనను ఈ కీలక బాధ్యతలకు అర్హుడిగా నిలిపాయి. క్రమశిక్షణ, అంకితభావం, సేవా తపన, ఈ మూడు లక్షణాలు ఆయన నాయకత్వానికి పునాది రాళ్లుగా నిలుస్తున్నాయి.

బీసీ సంక్షేమ ఉద్యమం గత కొన్ని దశాబ్దాలుగా అనేక సామాజిక మార్పులకు కారణమైంది. ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య  నాయకత్వంలో ఈ ఉద్యమం మరింత బలోపేతమై, అనేక మంది నాయకులను తీర్చిదిద్దింది. రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన పలువురు నాయకులు తరువాత ప్రజాప్రతినిధులుగా ఎదిగి, ఎమ్మెల్యేలుగా, ఎంఎల్సీ లుగా ప్రజాసేవలో విశేష పాత్ర పోషించారు. ఈ నేపథ్యం లో యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో అరవింద్ స్వామికి ఈ బాధ్యతలు అప్పగించడం ఒక సానుకూల, దూరదృష్టి గల నిర్ణయంగా భావించవచ్చు.

ఈ నియామక ప్రక్రియలో రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి మార్గదర్శకత్వం కీలకంగా నిలుస్తూ మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి ర్యాగ అరుణ్ గారు కూడా క్రియాశీలక పాత్ర పోషించి, యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడంలో తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారు. వారి సమిష్టి కృషి ఫలితంగా ఈ నియామకం సాధ్యమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:

About The Author

Latest News

దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా  ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
శేరిలింగంపల్లిలో ఘనంగా గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు
17వ వార్డులో వార్డు సభ... 
కోనేరు అభివృద్ధికి పూజ 
కోటకొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ 
మానవసేవే మాధవసేవ.. సమాజ సేవకుడు
కాటేదాన్ డివిజన్‌లో ఘనంగా హనుమాన్ జయంతి