డిసిసి కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

కుడా చైర్మన్, హనుమకొండ డిసిసి  అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ

డిసిసి కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎం ఎల్ సి

ఉమ్మడి వరంగల్ ప్రతినిధి,జనవరి 26

హనుమకొండ డిసిసి కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. హనుమకొండ లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని  హనుమకొండ డిసిసి కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ  బస్వరాజు సారయ్యలతో కలిసి వరంగల్ కూడా చైర్మన్, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు  ఇనగాల వెంకట్రామ్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతానికి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, డివిజన్, మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, ఎన్ఎస్యుఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News