శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం 22వ వార్షికోత్సవం

శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం 22వ వార్షికోత్సవం

 

 

 మిర్యాలగూడ మార్చి 5 

 (లోకల్ గైడ్ తెలంగాణ )

 

మిర్యాలగూడ పట్టణం విద్యానగర్ లో వెలసిల్లిన శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం 22వ వార్షిక బ్రహ్మోత్సవాలను రెండు రోజులుగా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. మొదటిరోజు బుధవారం నాడు కలశస్థాపన మూలవిరాట్ కు అభిషేకం, గణపతి హోమం నిర్వహించారు. రెండవ రోజు గురువారం నాడు సిద్ది బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కళ్యాణాన్ని వేద పండితులచే శాస్త్రోక్తంగా వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. భైరవభట్ల సీతారామ శర్మ ఆధ్వర్యంలో ఈ కళ్యాణ వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినట్లు శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు కాటేపల్లి నరసింహమూర్తి శర్మ, పులి కృష్ణమూర్తి శర్మ తెలిపారు. అనంతరం కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో కాటేపల్లి కృష్ణమోహన్, పుల్లాభట్ల లక్ష్మీనారాయణ శర్మ, విశ్వనాథ వరప్రసాద్, కృష్ణమూర్తి శర్మ మరియు భక్తులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 
సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం
గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు – సేవల నాణ్యతపై కఠిన సమీక్ష
విజయలక్ష్మి హాస్పిటల్ తనిఖీ. షోకాస్ నోటీసులు జారీ.