ప్రధాని ఖేల్ సంసద్ క్రీడలను విజయవంతం చేయాలి:బి జె వి ఎం అద్యక్షుడు మణిశంకర్
వచ్చేనెల ఏప్రిల్ 9 నుండి 24 తేదీ వరకు క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్,వార్డువైజు టోర్నమెంట్లు
ఐటెం 2
______
నారాయణపేట మార్చి18:
భారతదేశపు అతిపెద్ద క్రీడా వేదిక " ప్రధానమంత్రి ఖేల్ సంసద్ మహోత్సవ్ " వచ్చేనెల ఏప్రిల్ 9 నుండి 24 తేదీ వరకు క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్,వార్డువైజు టోర్నమెంట్లు నిర్వహించ బడతాయనీ నారాయణపేట పట్టణ బి జె వై ఎం అద్యక్షు డు మణిశంకర్ తెలిపారు.బుధవారం ఆయన పట్టణ బిజెపి అధ్యక్షుడు పోషల్ వినోద్, కౌన్సిలర్ కమలాపూర్ ప్రభా కర్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతు
దేశమంతటా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న యువకులు ఆసక్తిగల క్రీడల్లో నైపుణ్యత గల మట్టిలో మాణిక్యాలను వెతికి తీయా లనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభు త్వం చొరవతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎంపీ డీకే అరుణమ్మ ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింద న్నారు. దేశమంతా నిర్వహిం పబడే ఈ క్రీడల ద్వారా మం చి ప్రదర్శన ను కనబరిచే క్రీడాకారులను ఎంపిక చేసి వారిని జిల్లా,రాష్ట్ర స్థాయి పోటీలకు పంపి రాబోవు 15 సంవత్సరాల కాలంలో ఒలం పిక్స్ లాంటి ప్రపంచ స్థాయి క్రీడాకారులను మన దేశం తరపున ఆడించి తదితర క్రీడాల్లో భారత్ సత్తా చాటాల నేదే ఈ కార్యక్రమ ఉద్దేశం అన్నారు. నారాయణపేట పట్టణంలో తదితర క్రీడల్లో ఆసక్తిగల యువకులు క్రీడాకారులు ఈనెల 24వ తేదీ వరకు ఇట్టి కార్యక్రమ సంబంధిత క్యూఆర్ కోడ్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకొని క్రీడల్లో పాల్గొని విజయవం తం చేయాలని కోరారు.
ఫోటో రైట్ అప్:2.విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మణిశంకర్
______________________
