ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
స్వయం పరిపాలన దినోత్సవంను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
జడ్చర్ల జనవరి 9(లోకల్ గైడ్:
ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ పరిపాలనా బాధ్యతలను స్వీకరించారు.
కృపాంజలి హెడ్మాస్టర్ (HM)గా, గాయత్రీ కలెక్టర్గా, కీర్తన ఆర్.జె.డి (RJD)గా, రాంచరణ్ తేజ్డీ ఈఓ (DEO)గా, దీపిక ఎంఈఓ (MEO)గా బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా మొత్తం 42 మంది విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోపె లింగయ్య సర్పంచ్, మల్లేష్ యాదవ్ ఉప సర్పంచ్ హాజరయ్యారు. అలాగే శ్రీను, అహ్మద్ షరీఫ్, అబ్దుల్ అలీమ్, హరిహరనాథ్, హైమావతి, సంధ్య, సోమ్ల, మంజుల, విజయప్రతాప్, నిర్మల తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
కార్యక్రమం ముగింపులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ స్వయం పరిపాలన దినోత్సవం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించడంలో కీలకంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.
