కేజీబీవీ పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

కేజీబీవీ పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

హనుమకొండ జిల్లా ప్రతినిధి మార్చి22(లోకల్ గైడ్ 

హనుమకొండ జిల్లా లోని ఆత్మకూరు మండలం తిరుమలగిరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదివారం సందర్శించి పాఠశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని 10వ, 8వ, తరగతి విద్యార్థినులతో మాట్లాడి, వారి చదువు ప్రగతిని, పరీక్షలకు సన్నద్ధతను గురించి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించాలని, లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కృషి చేయాలని సూచించారు.
అనంతరం స్టోర్ రూమ్‌ను పరిశీలించి బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల నిల్వలను తనిఖీ చేశారు. విద్యార్థినుల కోసం తయారు చేస్తున్న భోజనాన్ని కూడా పరిశీలించి నాణ్యత ప్రమాణాలను పాటించాలని అధికారులకు సూచించారు.
పాఠశాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రత్యేక అధికారి వాసవి కలెక్టర్‌కు వివరాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ డాక్టర్ కన్నం నారాయణ, తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా  ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
శేరిలింగంపల్లిలో ఘనంగా గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు
17వ వార్డులో వార్డు సభ... 
కోనేరు అభివృద్ధికి పూజ 
కోటకొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ 
మానవసేవే మాధవసేవ.. సమాజ సేవకుడు
కాటేదాన్ డివిజన్‌లో ఘనంగా హనుమాన్ జయంతి